వైఎస్ భారతి : పులివెందులలో వైసీపీ గెలుపుని ఎవరూ ఆపలేరు..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగనుండటంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. అధికార, ప్రతి పక్ష పార్టీలు ధీటుగా ప్రచారం చేస్తు హోరా హోరిగా తలపడుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో ను ప్రకటించి రాబోయే ఐదేళ్లలో మరింత మంచి చేస్తామని హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రతి పక్ష కూటమి మరో రెండు రోజులలో తమ మేనిఫెస్టో ను ప్రకటించనుంది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కంటే మరింత మెరుగుగా ఈ సారి ఉమ్మడి మేనిఫెస్టో ను రచిస్తుంది. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఎంతో ధీమాగా వుంది. ఎన్నికల ప్రచారంలో నాయకులతో పాటు వారి సతీమణులు కూడా జోరుగా పాల్గొంటున్నారు.పులివెందులలో సీఎం జగన్‌ తరఫున ఆయన సతీమణి వైఎస్‌ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరుగుతూ ఆమె ప్రచారం చేస్తున్నారు.గడపగడపకు వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటు వేయాలని వారికీ వైఎస్‌ భారతి వివరిస్తున్నారు. సంక్షేమం కొనసాగాలన్నా.. పథకాలు అమలు జరగాలన్నా కేవలం వైసీపీతోనే సాధ్యమని ఆమె చెబుతున్నారు. పులివెందులలో వైసీపీకి భారీ మెజార్టీ వస్తుందని.. వైసీపీ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని వైఎస్‌ భారతి చెబుతున్నారు.. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందని లభిస్తుందని ఆమె చెబుతున్నారు. పులివెందుల ప్రజలు ఎప్పుడూ తమ వెంటే ఉన్నారని వైఎస్‌ భారతి తెలిపారు..వైఎస్సార్‌ బ్రతికున్నప్పటి నుంచి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లుగా ఆమె తెలిపారు.. జగన్ మాట ఇస్తే అమలు చేసి తీరుతారని.. చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మరిచిపోవడం ఆయన నైజమని ఆమె తెలిపారు. వైఎస్ భారతీకి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: