లోకేష్ కి ఎవరు ఊహించని కౌంటర్ వేసిన ఈటెల రాజేందర్

KSK
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను రద్దుచేసి ముందస్తు ఎన్నికల ప్రకటన చేసిన కేసీఆర్ పై దారుణంగా సెటైర్లు వేశారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఈ క్రమంలో  నారా లోకేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తనదైన శైలిలో స్పందించారు.


ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్‌లో తలపెట్టిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ…లోకేష్‌ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రజాకార్ల రాజ్యం అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని, కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందన్న ఆంధ్ర నాయకులు ఏమయ్యారో ప్రజలకు తెలుసని ఆయన మండిపడ్డారు.


అభివృద్ది ప్రాంతంగా తెలంగాణ విరాజిల్లుతుందని అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు.


అసలు తమ సొంత రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాడని వారు పక్క రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదని టిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇదే క్రమంలో మరికొంతమంది టీఆర్ఎస్ సభ్యులు ముందు నారా లోకేష్ గారు తెలుగు మాట్లాడటం నేర్చుకోండి తరువాత తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడవచ్చు అని పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: