ఇలాంటి చిన్న పనులే రేవంత్‌రెడ్డిని హీరోను చేస్తాయి..?

Chakravarthi Kalyan
నాయకుడు ప్రజలకు స్ఫూర్తిగా ఉండాలి. మంచి చేసిన వారి మెచ్చాలి. రంగారెడ్డి జిల్లా నందిగామలో రెండు రోజుల క్రితం అలెన్ హోమియో అండ్ హెర్బల్స్ ఫార్మాలో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కాపాడిని సాయిచరణ్ అనే బాలుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా అభినందించారు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన 17 ఏళ్ళ సాయి చరణ్‌... అగ్ని ప్రమాద తీవ్రతను పసిగట్టి భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయి చరణ్‌ సాయం చేశాడు.  అలా సాయి చరణ్‌ 6 మందిని కార్మికులను కాపాడాడు. అంతే కాదు..  మరికొంత మందిని అప్రమత్తం చేశాడు.
స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సాయి చరణ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేంత్ రెడ్డి...తన కార్యాలయానికి పిలిపించుకుని ఎమ్మెల్యే సమక్షంలో సాయి చరణ్ ను అభినందించి సత్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: