చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా వైసీపీ వర్సెస్ టీడీపీ ల మద్య మాటల యుద్దం కొనసాగుతున్న విషయం తెలిసిందే.   అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏ చిన్న చాన్స్ దొరికినా..అధికార పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబును దుమ్ముదులిపే కార్యక్రమం పెట్టుకుంటుంది.  అందుకే ఆమెను వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పిలుస్తారు.  నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.  విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెర వేర్చకుండా ఏపీ ప్రజలను మోసం చేసిందని కేంద్రంపై  పోరాటం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 

ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన ఈ రోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. కేంద్ర సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. హోదా, విభజన హామీల సాధనకు పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సిన సమయం ఇది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయమే చేసిందని పేర్కొన్నారు. తాజాగా సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజు ఫైర్ అయ్యారు. ధర్మ పోరాట దీక్షపై ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు.

కేంద్ర సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నానని చెప్పారు. హోదా, విభజన హామీల సాధనకు పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సిన సమయం ఇది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయమే చేసిందని పేర్కొన్నారు.విజయవాడలో మొన్న జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టారని... ఆ భయంతోనే చంద్రబాబు ఇప్పుడు దీక్షకు కూర్చున్నారని చెప్పారు. టిఫిన్లు చేసి వచ్చి దీక్షలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్షకు రూ. 30 కోట్లు ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: