మహేశ్, పవన్.. హోదా పోరులో ఈ సత్తా చూపరేం స్టార్లూ..!

Chakravarthi Kalyan
తమిళనాడులో జల్లి కట్టు ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఆ ఉద్యమానికి తమిళ హీరోలు, సినీ ప్రముఖులు కూడా మద్దతు ఇచ్చారు. తమిళనాడులో అంతే.. ఏదైనా సోషల్ ఇష్యూ వచ్చినప్పుడు సినీప్రముఖులు కూడా ఆ కష్టంలో భాగం పంచుకుంటారు. తాము నిజమైన హీరోలం అనిపించుకుంటారు. 


అదేం విచిత్రమో కానీ.. తెలుగు హీరోలకు మాత్రం సోషల్ ఇష్యూలు పెద్దగా పట్టవు. తమిళనాడులో జరుగుతున్న జల్లి కట్టు ఉద్యమానికి తెలుగు హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు వంటి సినీ హీరోలు మద్దతు పలికారు. పవన్ కల్యాణ్ ఏకంగా ఇది సౌత్ ఇండియాపై కేంద్రం వివక్ష అంటూ రెచ్చిపోయారు. మంచిదే. 


కానీ ఈ స్ఫూర్తి తెలుగు నేలపై సోషల్ ఇష్యూల విషయంలో ఏమైంది. ఆంధ్రాకు ప్ర్తత్యేక హోదా ఉద్యమ సమయంలో ఈ హీరోలు ఎందుకు అంతగా పట్టించుకోలేదు. విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు స్పందించలేదు. ప్రత్యేక హోదాకు ఎందుకు మద్దతు పలకలేదు. ఒక్క ప్రత్యేక హోదా విషయంలోనే కాదు. 



ఏ సామాజిక అంశంపైనా  తెలుగు హీరోలు పెద్దగా స్పందించరు. కానీ.. అదే హీరోలు మాత్రం పొరుగున జరుగుతున్న తమిళనాడులోని జల్లికట్టు ఉద్యమానికి మాత్రం జేజేలు పలుకుతారు. ముందు సొంత రాష్ట్రంలో.. తెలుగు రాష్ట్రాల్లో సమస్యలపై స్పందిస్తే బావుంటుందేమో.. అచ్చమైన తెలుగు హీరోలు అనిపించుకుంటే మంచిదేమో.. ఏమంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: