ఆ కారణంగా భర్తతో విడాకులు తీసుకున్న సీనియర్ నటి...!!

murali krishna
జంబలకిడి పంబ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమని మొదటి సినిమాతోనే హిట్ అందుకొని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారింది.స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నిర్మాత ఖాజా మొయిద్దీన్ ను మతాంతర వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె సినిమాల్లో కనిపించలేదు.తెలుగు నటి ఆమని ఎన్నో ఫ్యామిలీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైంది. ఇల్లాలు పాత్ర లతో మెప్పించిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెరుస్తుంది. చాలా అరుదుగా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు మరిన్ని సినిమాలు చేయడానికి రెడీ గా ఉంది. అవకాశాల కోసం వెయిట్‌ చేస్తుంది.

ఇదిలా ఉంటే ఆమని ఎన్నో ఫ్యామిలీ సినిమా ల్లో నటించింది. ఇల్లాలుగా ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా ఉండాలనే విషయాలను తన సినిమాల ద్వారా తెలియజేస్తుంది. ఉత్తమమైన వెండితెర ఇల్లాలు గానూ పేరు తెచ్చుకుంది. సినిమా ల్లో ఫ్యామిలీని నిలబెట్టుకునేందుకు ఎంతైనా పోరాడే పాత్రలు చేసి మెప్పించింది.పెళ్లైన ప్రారంభం లో సినిమాలకు దూరమైంది ఆమని. భర్తకి ఇష్టం లేకపోవడం తో ఆమె సినిమాలు మానేసింది. చాలా కాలం తర్వాత మధ్య మధ్యలో ఒకటి అర మూవీస్‌ చేస్తూ వచ్చింది. అయితే తనకు సినిమాలంటే ఇష్టం, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు.అయితే మా ఇద్దరి మధ్య దూరం అయితే పెరిగింది  దీంతో ఇద్దరు విడిపోయారు. ఒక అండర్‌ స్టాండింగ్‌ తోనే విడిపోయినట్టు చెప్పింది ఆమని. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరం గా ఉండాలని నిర్ణయించుకున్ని విడిపోయినట్టు తెలిపింది.అలాగే నా ఇద్దరు పిల్లలు బాధ్యతలను నేనే తీసుకున్నాను. నా పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం వాళ్లే నా ప్రాణం  అంటూ తాజా గా ఓ ఇంటర్వ్యూ లో ఆమని తన పర్సనల్ లైఫ్ పై కామెంట్స్ చేసింది.

.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: