వైరల్ గా మారిన సమంత డెసిషన్...!!

murali krishna
సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హాట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది  సమంత - నాగచైతన్య అని చెప్పాలి .సమంత - నాగ చైతన్య విడిపోయి చాలా కాలం అవుతుంది. వాళ్ళ విడాకుల టాపిక్ మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది. సమంత - నాగ చైతన్య విడాకుల అనంతరం పలు రూమర్స్ తెరపైకి వచ్చాయి.సమంతకి సంచలనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒక రకంగా వైఫై లా తన చుట్టు తిరుగుతుంది. ఒకప్పుడు తన సినిమాలు మాత్రమే మాట్లాడేవి. ఇప్పుడు పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతున్నాయి.తను కూడా అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.తాజాగా నాగ చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసాడు. ఆ ఫోటోకి శోభిత లైక్ కొట్టింది. దీంతో మరోసారి వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆ ఫోటో తీసింది శోభితనే అని  వాళ్లిద్దరూ కలిసి ఎక్కడికో వెకేషన్ కి వెళ్లారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శోభిత సైతం ఒక ఫోటో పోస్ట్ చేసింది. నాగ చైతన్య ఫోటో దిగిన లొకేషన్, శోభిత పోస్ట్ చేసిన ఫోటో లొకేషన్ కి దగ్గరగా ఉంది.అదేవిధంగా నాగచైతన్య - శోభితాను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా తెగ వార్తలు వైరల్ అయ్యాయి.అయితే సమంత చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.సీన్ కట్ చేస్తే కడుపు మండిపోయిన సమంత తీసుకున్న డెసిషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇన్నాళ్లు తన పెళ్లి డ్రెస్సును జాగ్రత్తగా ఎంతో అపురూపకంగా దాచుకున్న సమంత అ డ్రెస్సును రీ క్రియేట్ చేసింది .సమంత తెల్ల గౌన్ ని నలుపు రంగులోకి మార్చింది. దాన్ని ధరించి ముంబైలో జరిగిన ఒక అవార్డు కార్యక్రమానికి హాజరయ్యింది. వాటికీ సంబంధించిన ఫోటోలని ఇనిస్టాగ్రమ్ లో కూడా షేర్ చేసింది. నాకున్న అలవాట్లలో పాత దుస్తుల్ని రీమోడలింగ్ చేసుకోడం కూడా ఒకటి అనే పోస్ట్ కూడా చేసింది.
దీంతో నాగచైతన్యతో ఇక తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పకనే చెప్పేసింది అని.. ఎవరు ఎటు పోయినా నాకు అనవసరం అంటూ సమంత ఫిక్స్ అయిపోయింది అని .. అందుకే తన పెళ్లిని పెళ్లికి వేసుకున్న డ్రెస్ ని ఈ విధంగా మార్చేసింది అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: