అభిమానుల గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్...!!

murali krishna
సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ సామ్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇక సామ్‌.. గత కొన్ని రోజులుగా మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాన్నుంచి పూర్తిగా కోలుకునేందుకు సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుంది. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. అనారోగ్య సమస్యల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఒక పాడ్ కాస్ట్ కూడా ప్రారంభించింది. అందులో ఆరోగ్యంతోపాటు తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా తాను కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతానని పేర్కొంది. ఇక ఎంత అలసిపోయినా.. సినీ ఇండస్ట్రీలో 13 ఏళ్లు ఆగకుండా కష్టపడ్డానని తెలిపింది. ఇక తన బాల్యం గురించి మాట్లాడింది. తన బాల్యం విలాసవంతమైనది కాదని తెలిపింది.తన చిన్నతనం నుంచే విజయంపై ఫోకస్ పెట్టానని చెప్పింది. తాను జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో తరచూ ఒత్తిడిని అనుభవించానని పేర్కొంది. అయితే ఆ లక్ష్యమే తనని విజయాన్ని సాధించడానికి తోడ్పడిందని తెలిపింది. తాజాగా తన అభిమానుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చింది. తన మాటను గౌరవించే అభిమానులు ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక తన అభిమానుల్లో చాలామందికి వినోదం, ఫ్యాషన్‌, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుందని పేర్కొంది. వారిని చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని, కొత్త అంశాలపై అవగాహన వచ్చినట్లు తెలిపింది. తన మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా తనకు ఆనందమేనని పేర్కొంది. వీటి ద్వారా కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అంటూ చెప్పుకొచ్చింది.
ఇక తన మనసుకు నచ్చిందే చేస్తానని సమంత ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదా.. కాదా, అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తానని తెలిపింది. మానసికంగా ప్రశాంతంగా లేకపోతే శారీరకంగా కూడా ఫిట్‌గా ఉండలేదని పేర్కొంది. అందుకే తానెప్పుడూ మెంటల్‌ హెల్త్‌కు ప్రాధాన్యతనిస్తానని వెల్లడించింది. అందుకోసం అవసరమైన వ్యాయామాలు కూడా చేస్తుంటానని వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: