ఆరా రిపోర్ట్: గుడివాడలో కొడాలి నానికి బిగ్ షాక్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలలో తెలుగుదేశం కూటమికి అనుకూలంగా కొన్ని సర్వే సంస్థలు రిపోర్టులను ఇచ్చాయి. అదే స్థాయిలో వైసిపి పార్టీకి కూడా చాలా సంస్థలు అనుకూలంగా ఇవ్వడం మనం చూసాం. దీంతో ఏపీ ప్రజలు ప్రస్తుతం గందరగోళం పరిస్థితుల్లో ఉన్నారు.
 
కానీ చాలా సంస్థల కంటే.. ఆరా మస్తాన్ సర్వే సంస్థ చాలా నమ్మదగ్గర అన్న సంగతి తెలిసిందే. గతంలో ఆరా మస్తాన్ ఏపీ ఎన్నికలపై ఎగ్జాక్ట్ గా రిపోర్టును ఇవ్వగలిగింది. దీంతో ఈసారి కూడా ఆరా మస్తాన్ అదే స్థాయిలో ఇస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ ఫలితాలను రిలీజ్ చేసిన ఆరా మస్తాన్... వైసీపీ పార్టీకి ఎడ్జ్ ఇచ్చింది. ఏపీలో వైసీపీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టబోతున్నట్లు... ఆరా మస్తాన్ సర్వే సంస్థ వెల్లడించింది.

 
 ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి 49.4% ఓట్లు పోలవుతాయని చెప్పిన ఆరా... వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు దక్కుతాయని తెలిపింది. అంతేకాకుండా తెలుగుదేశం కూటమికి 71 నుంచి 81 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని... ఆ మూడు పార్టీలకు 47.  5 % ఓట్ పర్సంటేజ్ వస్తుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఏపీలో ఉన్న రోజా, అంబటి రాంబాబు, విడుదల రజిని లాంటి కీలక మంత్రులు కూడా ఓడిపోతారని ఆరా మస్తాన్ తెలిపింది.


ఇటు గుడివాడ నియోజకవర్గంలో... కొడాలి నాని గెలుపు పై కూడా ఆరా మస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది.  కొడాలి నానిని ఓడించేందుకు విదేశాల నుంచి చాలామంది వచ్చారని... ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కాస్త ఎడ్జ్ ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే కొడాలి నాని కచ్చితంగా ఓడిపోతాడని మాత్రం చెప్పలేకపోయారు ఆరా మస్తాన్. అలాగే.. గన్నవరంలో  వల్లభనేని వంశీ విజయం సాధిస్తాడని తెలిపారు. పోల్ మేనేజ్మెంట్... సరైన ప్రచారంతో వల్లభనేని వంశీ బయటపడతారని వివరించారు  ఆరా మస్తాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: