తెనాలి : ఆ ఓటరును అందుకే కొట్టాను..స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతుంది. అయితే ఇదే సమయంలో గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ పోలింగ్ బూత్ లో ఊహించని ఘటన జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.స్థానికంగా ఓటేసేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ బూత్ కు వచ్చిన ఓ ఓటర్ పై చేయి చేసుకున్నారు., అతను తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ ఈ ఘటనపై స్పందించారు.
తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అన్నాబత్తుని శివకుమార్..ఇవాళ ఓటు వేసేందుకు స్దానికంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ క్యూలైన్ లో కాకుండా నేరుగా ఓటు వేసేందుకు వెళ్లబోయారు. దీంతో అప్పటికే క్యూలైన్లో ఉన్న ఓ సాధారణ ఓటరు అభ్యంతరం వ్యక్తం చేసారు.. దీంతో ఆ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఓటరు చెంపపై కొట్టారు. తిరిగి ఆయన కూడా కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయి ఆయనపై దాడికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ ఘటనపై ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ స్పందించారు.. ఓటరును ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలిపారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ తెనాలి ఐతానగర్‌లో భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చానని అక్కడ ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించినట్లు అన్నాబత్తుని శివకుమార్‌ తెలిపారు..తమ పార్టీపై దూషనలు చేసారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నా భార్య ముందే తనను అసభ్యంగా ధూషించాడని అన్నాబత్తుని శివకుమార్‌ తెలిపారు.తాను ఓటు వేయడానికి  వెళ్లేటప్పుడు అలాగే వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడని తెలిపారు.ఆ ఓటరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన టిడిపి వ్యక్తి అని అన్నారు.. టిడిపి-జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో  మనుషులను పిలిపించి వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని అన్నాబత్తుని శివకుమార్ వారిపై మండిపడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: