ఏపీ: టీడీపీ హయాంలోనే ముస్లింల అభివృద్ధి జరిగింది: టీజీ భరత్
అదేవిధంగా 2018లో కర్నూలులో ఇస్తేమా నిర్వహించినప్పుడు రూ.10 కోట్లు మేర నిధులు టీడీపీ ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ముస్లింలకు రంజాన్ తోఫాను, పండగ బాహాటంగా అట్టహాసంగా జరుపుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిందన్నారు. ఈ కార్యక్ర మాలన్నీ టీడీపీ, బీజేపీ పోత్తులో ఉన్నప్పుడే జరిగాయని గుర్తుపెట్టుకోవాలి సూచించారు. కేవలం ఎన్నికల ముందుకు బీజేపీతో టీడీపీ పొత్తు ఉండదని, టీడీపీని గెలిపిస్తే ముస్లింలు నష్టపోతారని అసత్య ప్రచారాలు చేసే వైసీపీ నాయకులు వ్యాఖ్యలు అస్సలు నమ్మ వద్దని ఈ సందర్భంగా వారికి సూచించారు.
కాగా ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మహబూబ్ బాషా, హమీద్, ఇబ్రహిం, జనసేన కార్యకర్తలు, బూత్ ఇన్చార్జిలు ఇంకా అనేకమంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే నగరం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా కర్నూలు పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చెప్పుకొచ్చారు. నగరంలో యువతకు అవసరమైన ఉపాధి అవకాశాలకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నానని, అలాగే మహిళలు, కార్మికులు, దుకాణాల్లో పని చేసే కార్మికులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు టీడీపీ చర్యలు చేపడుతుందని కూడా ఆయన ఈ సందర్భంగా మాటిచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంత నష్టపోయామో పరిస్థితులు ఒక సారి గుర్తు చేసుకోమని వారికి చెప్పారు.