పరీక్షలు రద్దు : సుప్రీంలో మరో పిటిషన్!
భౌతికంగా పరీక్షల నిర్వహణపై వేలాది మంది విద్యార్ధుల తల్లిదండ్రులు భయంతో వణికి పోతున్నారని న్యాయవాది మమత ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ 10 వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహించి తీరుతామని ప్రకటించిందని, ఇదే తరహాలో పంజాబ్, కర్నాటక, అస్సాం రాష్ట్రాలు తేదీలు కూడా ప్రకటించిన విషయాన్ని మమతా శర్మ కోర్టు దృష్టికి తీసుకు వచ్చాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు మినహా.. సిబిఎస్ఈ సహా అన్ని తమ పరిధిలో ఉన్న బోర్డు పరీక్షలు రద్దు చేశాయన్న ఆమె అన్ని బోర్డులకు ఒకే నిబంధన ఉండాల్సిన అవసరం ఉందని తన పిటిషన్లో పేర్కొన్నారు.
అలా చేస్తేనే విద్యార్ధుల మనసుపై ప్రభావం లేకుండా ఉంటుందని న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికే విచారణ జరుగుతున్న కేసులోనే మమతా శర్మ ఇంటర్ వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఇక నేడు ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. విద్యార్ధుల ప్రాణాలు నిలబెట్టేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు న్యాయవాది. ఇక ఏపీ విషయానికి వస్తే పదో తరగతి చాలా ముఖ్యం అని అందుకే ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించి తీరతామని చెబుతున్నారు.