యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం..!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న లాస్య తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టుని షేర్ చేసింది. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా లాస్య కు సానుభూతి తెలియజేస్తున్నారు.. మరి కొంతమంది ధైర్యంగా ఉండమంటూ సలహాలు ఇస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే లాస్య భర్త మంజునాథ్ తండ్రి గడిచిన కొన్ని గంటల క్రితం మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె తెలియజేసింది.. మిస్ యు అంకుల్ మీ ఆత్మకు శాంతి చేకూరాలనుకుంటున్నాను అంటూ ఒక ఎమోషనల్ కొటేషన్తో పోస్ట్ చేసింది.

ఈ సందర్భంగా తన మామ తో దిగినటువంటి కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది లాస్య. మీ ఆత్మకు శాంతి చేకూరాలనుకుంటూ మిస్ యు నాన్న అంటూ ఆవేదనతో  యాంకర్ లాస్య భర్త మంజునాథ్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం లాస్య దంపతులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. కానీ లాస్య తన మామ మృతికి గల కారణాలను మాత్రం అసలు తెలియజేయలేదు. మంజునాథ్ ఈ విషయం పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

యాంకర్ లాస్య మంజునాథ్ ది ప్రేమ వివాహం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహాన్ని చేసుకోవడం జరిగింది. 2017లో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో స్టార్ యాంకర్ గా బుల్లితెర పైన ఆకట్టుకున్న లాస్య ఇప్పుడు వాటన్నిటికీ గుడ్ బై చెప్పి కేవలం కుటుంబానికి పరిమితమైంది.సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్గా ఉంటూ పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. లాస్య సొంతంగానే ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా మొదలు పెట్టింది ఇందులో పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: