నాగార్జునకు చెప్పొద్దు అంటూ డైరెక్టర్ పూరీకి చుక్కలు చూపించిన అనుష్క..??

murali krishna
 లేడీ సూపర్ స్టార్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈముద్దుగుమ్మ సూపర్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.తర్వాత తన నటన, అందంతో స్టార్ హీరోల సరసన నటించే అవకావం సంపాదించుకొని, స్టార్ హీరోయిన్‌ అయిపోయింది. అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఈ బ్యూటీకి మించిన తోపులేరన్నది వాస్తవం. ముఖ్యం అరుంధతి సినిమాతో ఈ నటి ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగాలంటే అందంగా ఉండాలి. కానీ ఇటీవల కాలంలో అందం కాకుండా టాలెంట్ తో చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి.అనుష్క గ్లామర్ పాత్రల్లో ఎక్కువగా చేయకపోయినా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకొని ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.కాగా, తాజాగా ఈనటికి అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి అయితే ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు దర్శకుడు పూరి జగన్నాథ్‌కు చుక్కలు చూపెట్టిందంట. అయితే స్వీటీ సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటికి ఆఫర్ వచ్చింది. దీంతో అనుష్కను పూరి జగన్నాథ్ నీది ఒక ఫొటో ఇవ్వమని అడగగా, బ్యాగ్ లో నుంచి పాస్ ఫోటో తీసి ఇచ్చిందంట. దీంతో షాకైన డైరెక్టర్, ఇది నేను నాగార్జునకు చూపెట్టాలా? అని అడిగాడంట. దీంతో భయపడి పోయిన అనుష్క వద్దు ప్లీస్ చెప్పకండి అని చెప్పిందంట.
ఇక తర్వాత పూరీ వెంటనే తనకు ఫొటో షూట్ చేయించాడంట. ఆ సమయంలో కూడా అనుష్క తనకు ఫోజులు పెట్టరాక కెమెరా మెన్‌కి పూరీకి చుక్కలు చూపెట్టిందంట. ఇక తర్వాత ఆమె ఫొటోస్ చూసిన నాగార్జున సూపర్ సినిమాకు సెలెక్ట్ చేశారంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం అనుష్కకు టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయనే చెప్పవచ్చు. మిస్టర్ పొలిశెట్టిలో నటించిన తర్వాత మళ్లీ ఈ నటికి అంతగా ఆఫర్స్ ఏం రావడం లేదని తెలుస్తోంది. కాగా, ఏదో ఒక ఇష్యూతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఈ నటి.సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: