పెళ్లి చేసుకోబోతున్నారా.. తహసీల్దార్ల ఆశీర్వాదం తప్పనిసరి?

praveen
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు అతి తక్కువగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు అంతకంతకూ పెరిగి పోతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రజానీకం మొత్తం బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కరోనా  నియంత్రణకు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో మంది ప్రజలు నిర్లక్ష్యంగా వివిధ రకాల శుభకార్యాలు  పెళ్ళిళ్ళు పేరంటాలు లాంటివి ఘనంగా నిర్వహించడం ఇక ఆయా కార్యక్రమాల్లో గుంపులుగా ప్రజలు ఉండడం కూడా కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం గా మారిపోతుంది.



 ఈ నేపథ్యం లో గత ఏడాది పెళ్ళిళ్ళు శుభకార్యాల పై ఆంక్షలు విధించినటు గానే ఈసారి కూడా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే తక్కువమంది బంధుమిత్రుల తో  శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఆంక్షలు విధిస్తూ  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా తహసిల్దార్ పర్మిషన్ తీసుకోవాలి అంటూ స్పష్టం చేసింది.




 జన సమూహాల నుండి నియంత్రించేందుకు 30 లేదా 50 మంది వరకు మాత్రమే పెళ్లికి హాజరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక పెళ్లి కోసం ముందు గానే వధూవరులకు సంబంధించిన ఆధార్ కార్డులు పెళ్లి పత్రిక సమర్పించి అనుమతి పొందాల్సి ఉంటుంది. వీఆర్వో అనుమతి ప్రకారమే శుభకార్యాలను నిర్వహించుకోవాలి ఉంటుంది. ఇక మిగితా శుభకార్యాలకు కూడా ఇలాంటి ఆంక్షలు అమలు లోకి తీసుకు వచ్చేందుకు అధికారులు భావిస్తున్నారు . అయితే ఇలా జన సమూహాలను లేకుండా చేయడం వల్ల కరోనా వైరస్ కేసులు ఎంతో సమర్థవంతం గా కట్టడి చేయవచ్చు అని అధికారులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: