స్టేట్ బ్యాంక్ బాటలో మరో బ్యాంక్.. కస్టమర్లకు గుడ్ న్యూస్..
వీటి పేరు టైటాన్ పే.. ఇక ఇందులో భాగంగా టైటాన్ వాచ్ తోనే నేరుగా కాంటాక్ట్ లెస్ చెల్లింపులూ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ సరికొత్త సర్వీస్ కస్టమర్ కి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఇప్పుడు ఎస్బిఐ దారిలోనే మరో బ్యాంకు కూడా నడిచింది. ప్రైవేటు రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ తాజాగా వేరబుల్ డివైస్ ను అందుబాటులోకి తీసుకువచ్చి కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కార్డు నెట్ బ్యాంకింగ్ వంటివి కాకుండా నేరుగా డివైస్ తోనే చెల్లింపులు నిర్వహించేందుకు అవకాశం ఉంది. దీని పేరు వియర్ ఎన్ పే. కీచైన్, వాచ్ లూప్, బ్యాండ్ రూపంలో యాక్సిస్ బ్యాంక్ వేరబుల్ డివైజ్ పొందొచ్చు. ఇది నేరుగా బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది డెబిట్ కార్డు లాగానే తరచు దీన్ని ఉపయోగించేందుకు అవకాశం కూడా ఉంటుంది.
అయితే ఈ సరికొత్త డివైస్ ద్వారా దాదాపు 750 రూపాయల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిద్వారా కస్టమర్లు అందరు కూడా కాంటాక్ట్ లెస్ పేమెంటు జరిపేందుకు అవకాశం ఉంటుంది. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలనే కాంటాక్ట్ లెస్ పేమెంట్ ల లిమిట్ పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాంకులు అన్నీ కూడా ఇలాంటి సేవలను తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్ కింద ఏకంగా ఐదు వేల వరకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది అన్న విషయం తెలిసిందే.