గ్రేటర్ యుద్ధం : ఆ అభ్యర్ది కొంప ముంచిన సొంత కొడుకు
ఆ విషయం ఎలా ఉన్నా సరే, బీ ఎన్ రెడ్డి డివిజన్ లో వింత ఘటన జరిగింది. అదేంటంటే ఈ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో విజయం సాధించాడు. అదే డివిజన్ లో ఇండిపెండెంట్ డమ్మీ అభ్యర్థిగా టీఆరెస్ అభ్యర్థి లక్ష్మీప్రసన్న కుమారుడు ముదగౌని రంజిత్ గౌడ్ పోటీ చేశారు. రంజిత్ గౌడ్ కు 39 ఓట్లు పోల్ అయి తల్లి ఓట్లు చీల్చాడు. అవే వోట్లు చీల్చకుండా ఉండి ఉంటె టీఆర్ఎస్ అభ్యర్ది గెలిచి ఉండేది. ఆ విధంగా ముందు జాగ్రత్త కోసం వేయించిన డమ్మీ నామినేషన్ కొంప ముంచింది.
నిజానికి అసలు అభ్యర్ధికి డమ్మీగా వారి కుటుంబానికి చెందిన ఎవరో ఒకరు నామినేషన్ వేయడం ఆనవాయితీ గా వస్తోంది. ఒక వేళ ఏదయినా కారణాల వలన అసలు అభ్యర్ధి నామినేషన్ తిరస్కరించినా డమ్మీ అభ్యర్ధి రేసులో ఉన్నట్టు అవుతుంది. ఆ ముందు జాగ్రత్త కోసం వేయించిన డమ్మీ నామినేషన్ కొంప ముంచింది.