యూపీలో మరో దారుణం.. బాలికపై బంధువులే కన్నేశారు.. చివరికి మత్తుమందు ఇచ్చి..?

praveen
ఎన్ని కటిన చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని దారుణమైన శిక్షలు విధించిన  రోజు రోజుకు సభ్య సమాజంలో మహిళలకు రక్షణ మాత్రం కరువైపోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయి ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఆడపిల్ల జీవితం రోజురోజుకూ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఆడపిల్ల అర్థ రాత్రి బయట తిరిగినప్పుడు మాత్రమే దేశానికి అసలు సిసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ తెలిపారు. నేటి సమాజంలో చూస్తుంటే.. ఆడపిల్ల అర్ధరాత్రి బయట తిరగడం కాదు కనీసం పట్టపగలు కూడా బయట తిరిగ లేని దుస్థితి వచ్చింది. స్వతంత్ర దేశంలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోయింది.



 కామందుల బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహిళల జీవితాన్ని అంధకారం లోకి నెడుతూనే ఉన్నారు కామాంధులు. రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో దళిత యువతిపై కొంతమంది యువకులు అత్యాచారం చేసి దారుణంగా దాడి చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఈ ఘటనలో నిందితులకు ఉరిశిక్ష వేసి చంపాలి అంటూ రోజురోజుకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.



 కామంతో కళ్లుమూసుకు పోయిన ఇద్దరు యువకులు 15 ఏళ్ల వయస్సు గల బాలికలను  ఎత్తుకెళ్లి మత్తు మందు ఇచ్చి మరీ అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు దిగిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో వెలుగులోకి వచ్చింది. బంధువులైన ఇద్దరు యువకులు పదిహేనేళ్ల బాలికను ఎత్తుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారు.. తర్వాత  అదంతా వీడియో తీసి బాలికను బ్లాక్ మెయిల్ చేయడంతో.. తన తండ్రితో కలిసి పోలీసులను ఆశ్రయించింది బాధిత బాలిక. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: