చైనా గుట్టు సాక్ష్యాలతో బయట పెట్టిన సియోల్.. అవేంటో తెలిస్తే గుండె జల్లుమనాల్సిందే..!!
కరోనా వైరస్(కోవిడ్-19).. ప్రపంచదేశాలను గడగడలాడిస్తూ.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే వేల మంది కరోనాకు బలిపోయారు. లక్షల్లో దీని బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే ఈ వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో మరింత తలనొప్పిగా మారింది. చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ దెబ్బకు దేశదేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. కరోనా పుట్టి, పెరిగింది చైనాలో. ఆ దేశంలోనే వేలాది మంది ప్రాణాలు తీసిన ఆ మహమ్మారి ప్రపంచ దేశాలకు విస్తరించింది. మరియు లక్షల మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసింది.
అయితే, ఖండాలకు విస్తరించిన ఈ వైరస్ వ్యాప్తి.. చైనాలో మాత్రం తగ్గుముఖం పట్టింది. దీంతో చైనాపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ ఎలా పుట్టింది? ఎలా బయటికి వచ్చింది? అనే ప్రశ్నలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. ఓ మాంస విక్రయశాల నుంచి వచ్చిందని, పాముల నుంచి సోకిందని, గబ్బిలాల వల్లే వ్యాప్తి చెందిందని.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ, కచ్చితమైన ఆధారం దొరకలేదు. ఇప్పుడు ఈ వైరస్ పుట్టన చోటే అంతం అవుతుండడంతో.. ఈ వైరస్కు కారణం చైనానే అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చైనా గురించి కొన్ని భయంకర నిజాలు అంటూ సాక్ష్యాలతో సహా ఓ వార్తను ప్రచురించింది సియోల్ టైమ్స్.
చైనాలో శిశుమాంస భక్షకులు.. ఒకే సంతాన నిబంధన వెనక రాక్షసత్వం అంటూ సియోల్ టైమ్స్లో వచ్చిన వార్త బాగా వైరల్ అవుతోంది. చైనీయులు గతంలో ప్రభుత్వ నిబంధన అయిన ఒకే సంతాన నిబంధన కారణంగా తమ గర్భస్థశిశువులను హోటల్ డిష్ లుగా మార్చడం కోసం అమ్ముకుంటున్నారు అన్నది ఈ వార్త సారాంశం. గర్భస్థశిశువులను రకరకాల హెర్బల్ సూపులు పేరుతో ఒక డిష్ కు నాలుగు వేల అమెరికన్ డాలర్స్కు అమ్ముతున్నారట. ప్రధానంగా సంపూర్ణ, శారీరక బలానికి, నవ యవ్వనానికి, లైంగిక సామర్థం కోసం అంటూ అమ్ముతున్న ఈ బేబీ సూపుల కోసం రెగ్యులర్ కస్టమర్లు కూడా ఉన్నారని సియోల్ టైమ్స్లో ప్రచురించిన వార్తలో తెలిపింది.
62 ఏళ్ల వయస్సులో.. 19 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్న ఒక కస్టమర్.. తనకు ఈ డిష్ బాగా బలాన్ని ఇచ్చిందని కూడా తెలిపాడట. రిబ్ సూప్ అని లోకల్గా.. బేబీ సూప్ అనే కోడ్తో పిలిచే ఈ డిష్ ల కోసం శిశువుల దేహాన్ని చైనీస్ మూలికలు, చికెన్తో కలిపి వండుతారట. అయితే ఎక్కువగా ఆడశిశువులే దీనికి బలవుతారట. ఎందుకంటే మగ పిల్లలు కావాలనుకునేవారు.. తమకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసిన తర్వాత.. ఇక్కడకు వచ్చి నెలలు నిండక ముందే తమ పిల్లలను అమ్ముకుంటున్నారని తేలిందట. ఇక ఇక్కడ బ్రతికి ఉన్న శిశువులను మాత్రమే కొంటారట. ప్రస్తుతం ఈ భయంకరమైన, దారుణమైన వార్త వైరల్ అవుతోంది. అయితే ఇది ఎంత వరకు నిజం అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు.