చైతు... కార్తీక్ దండు కాంబో మూవీ అప్పటినుండే ప్రారంభం..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ప్రస్తుతం చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం చివరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే చైతూ తన నెక్స్ట్ మూవీ ని కూడా సెట్ చేసుకున్నాడు. నాగ చైతన్య తన తదుపరి మూవీ ని విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ ని "ఎస్ వి సి సి" బ్యానర్ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య , కార్తీక్ దండు , ఎస్ వి సి సి బ్యానర్ లో రూపొందబోయే సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుండి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత చాలా స్పీడ్ గా ఈ మూవీ యొక్క షూటింగ్ ను పూర్తి చేసే విధంగా ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరో గా నటిస్తూ ఉండడం విరూపాక్ష లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వం వహించబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: