మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు కొనసాగుతుంది.  ఇప్పటికే ముఖ్య నేతలు ప్రచారాల్లో మునిగిపోయారు.  ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తి పోసుకుంటూ ప్రచారాల్లో ముందుకు సాగుతున్నారు.  ‘ప్రజా సంకల్ప’యాత్ర తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపిలో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే.  అలాంటి జగన్ మోహన్ రెడ్డి ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. 

నన్ను అరెస్టు చేయొచ్చు, విపరీతమయిన కుట్రలు రాష్ట్రమంతా మాపై పార్టీ ముఖ్య నాయకులం దరిని అరెస్ట్ చేయ్యోచ్చు, మమ్మల్ని ప్రచారం చేయకుండా అడ్డు పడొచ్చు మాకు మీరు అండ. పల్లెల్లో ఉన్న మీరందరే మాకు అండ అంటున్నారు.  ఇలాంటి మాటలు డైనమిక్ లీడర్ - వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి నోట వెంట రావడం బహుశా మొదటిసారి అయివుండొచ్చు.

ఎటువంటి పరిస్థితి ఎదురయినా ఎదుర్కొంటారు, ధైర్యవంతుడు తెగింపు - తెగువు కలిగిన నాయకుడిగా చెప్పబడే వైఎస్ జగన్ ఇంత బేలగా మాట్లాడటానికి కారణం ఏమై ఉంటుందంటూ చెవులు కొరుక్కుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమయినా గత తొమ్మిదేళ్లలో ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొనన్ని ఒత్తిళ్లను ఎదుర్కొని పుటమేసిన బంగారంలా వస్తున్న జననేత జగన్ కు అంతా మంచి జరగాలని కోరకుంటున్నారు అశేష ఆంధ్ర వైఎయస్ అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: