ఎన్నికలయిన నాటి నుంచి నేటి వరకూ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తుండడం రఘురామాకే సాధ్యం..అని పలువురు పరిశీ లకులు అంటున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పట్టుబడుతుంటే, అందుకు ప్రతిగా ఆయన చేస్తున్న పోరాటం కొంత రాజకీయ వర్గాల్లోనూ, రాజకీయేతర వర్గాల్లోనూ చర్చకు తావిచ్చింది.ఇప్పటికిప్పుడు ఫలితం ఏమన్నది తేలకున్నా రేపటి వేళ రఘురామ అనుకున్నది సాధిస్తే, మరికొన్ని విషయాలు ఆయనతోనే బీజేపీ మాట్లాడించవచ్చని, ఆ విధంగా రాష్ట్ర రాజకీయా ల్లో రఘురామా పేరును వినియోగించుకోవచ్చని ,తమకు అనుగుణంగా కొన్ని స్టేట్మెంట్లు సైతం ఇప్పించుకోవచ్చని బీజేపీ భావి స్తోందని వైసీపీ తరఫు వాదన. కానీ ఇవి ఎలా ఉన్నా ఇప్పటికిప్పుడు సెషన్ లోనూ బయటా తనకు చేతనయినంత మాట్లాడడ మే కాదు అందులో వివాదాలు ఉన్నా కూడా వెనుకంజ వేయకుండా,తనకు ప్రాణ హాని ఉందన్న విషయం కూడా గుర్తించడం కూ డా చేయకుండా తన పని తాను చేసుకుపోవడంలో ముందంజలో ఉన్నారని ఆర్ ఆర్ ఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.అదే విధంగా ఇ ప్పటి తరం రాజకీయ నాయకులలో యతమకు పడని విషయాన్ని పడని విధంగా చెప్పడంలో ఓ విధంగా ఈయన సక్సెస్ అ య్యారని క్షత్రియ సంఘాలు కూడా పొగుడుతున్నాయి.ఆయనకు మద్దతు ఇస్తున్నా యి.అశోక్ గజపతి రాజుకూ, రఘరామ కృ ష్ణం రాజుకు ఒకటే తేడా..ఆయన మాట్లాడరు..పెద్దగా వివాదం చేయరు కానీ ఆర్ ఆర్ ఆర్ అలా కాదు చిన్న చిన్న విషయాలు సైతం స్పష్టంగా లేఖలు రాసి మరీ! పరిణామాలు మీడియాకు అర్థం అయ్యే వరకూ వివరిస్తారు.కోర్టు ప్రొసీడింగ్స్ ను కూడా వి శ్లేషిస్తారు.
ఎంపీ రఘు రామ పార్లమెంట్ లో నూ బయట తనదైన శైలిలో మాట్లాడుతున్నారు. హాజరు శాతం 90కు పైగానే ఉంటోంది.ఇతర ఆంధ్రా ఎంపీలూ సాధించలేనిది ఆయన సాధించింది ఒక్కటే.ఆయనేం అనుకుంటున్నారో అదే చెప్పడం.వాటిపై క్లారిఫికేషన్ ఇవ్వ డం.. ఈ రెండు ఆ గొంతకకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.దీంతో ఆయన సోషల్ మీడియాలోనూ మంచి పేరు తెచ్చుకుంటు న్నార న్నది ఓ వాస్తవం. సీఎం బెయిల్ ను రద్దు చేయాలని అ డిగి.,అటుపై కోర్టుల వెంట తిరిగి ఆఖరికి విషయాన్ని ఏదో ఒక విధంగా పైనల్ స్టేజ్ కు తీసుకువచ్చారు.ఇక దీనిపై సీబీఐ కోర్టు ఆగస్టు 25 ఏమంటుంందో అన్నది ఆసక్తికరం.అదేవిధంగా సాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చే యాలని కోర్టును ఆశ్రయించారు..ఇవి పార్లమెంట్ ప్రాంగణం వెలుపల అయితే,లోపల ఆయన 140కు పైగా ప్రశ్నలు అడిగి,వాటికి సమాధానాలు రాబట్టారు.అధికార పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక్కరే ఈ విషయంలో ఆయ నతో పోటీ పడడం విశేషం.