ఇజ్రాయిల్ దెబ్బకు.. స్మశానాల్లోనే ఉండిపోతున్నారు?
ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ దాడులు నేపథ్యంలో గాజాలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తు ప్రతి ఒక్కరిని ఉనికి పడిన చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న ప్రజలు సైతం ఏ క్షణంలో బాంబు దాడి జరిగి ప్రాణాలు పోతుందో కూడా తెలియక అనుక్షణం ప్రాణాలను గుప్పెట్లో బ్రతుకుని క్షణక్షణ గండంగా బ్రతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్, హమాస్ తీవ్రవాదుల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇక గాజాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారి పోతున్నాయి అన్నది తెలుస్తుంది.
ఏకంగా ఇజ్రాయిల్ బాంబుల దాడి నుంచి తమను తామును రక్షించుకునేందుకు ఎంతో మంది నిరాశ్రయులు శరణార్థి శిబిరాలలో ఆశ్రయం పొందుతున్నారు . అయితే శరణార్థులు తాకిడితో శిబిరాల్లో ఖాళీ లేకుండా పోతుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చివరికి స్మశాన వాటికలలో తలకాచుకుంటున్నారట. స్మశానంలో అయితే ఎలాంటి బాంబుదాడులు జరగవు అని భావిస్తూ చివరికి ఇక స్మశానాల మధ్యలోనే చివరికి శిబిరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. అయితే యుద్ధం ఆపేందుకు ఇజ్రాయిల్, హమాస్ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినప్పటికీ చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. ఇలా హమస్ తీవ్రవాదులకు ఇజ్రాయిల్ కు మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారిపోయింది.