తెలంగాణ స్టూడెంట్కు రూ.2 కోట్ల స్కాలర్షిప్..?
డైయర్ ఫెలోషిప్ స్కాలర్షిప్ పొందే అర్హత సాధించినందుకు గాను తాను ఎంతో గర్వంగా ఫీలవుతున్నానని శ్వేత సంతోషం వ్యక్తం చేశారు. తనకు లాఫాయెట్ కాలేజీలో ఈ అద్భుత అవకాశం రావడానికి డెక్స్టెరిటీ గ్లోబల్ సంస్థ ఇచ్చిన శిక్షణ, ప్రోత్సాహమే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. డెక్స్టెరిటీ టూ కాలేజ్ అనేది ఇండియన్ హైస్కూల్స్, కాలేజీలలో యంగ్ లీడర్లకు ఇచ్చే ఒక కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో శ్వేత నాలుగు సంవత్సరాలపాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆమె అక్కడ నాయకత్వ పటిమతో పాటు సమస్యలను పరిష్కరించే స్కిల్స్ పెంపొందించుకున్నారు. కేరిర్లో తాను ఎదగడానికి సహాయపడ్డ డెక్స్టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ సాగర్కు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. ఆయనకు ఎప్పటికీ తాను రుణపడి ఉంటానని ఆమె వ్యాఖ్యానించారు.
ఇకపోతే శ్వేత స్కాలర్షిప్ సాధించడం పట్ల సీఈవో శరద్ సాగర్ స్పందించారు. నెక్స్ట్ జనరేషన్ కోసం లీడర్స్ ని తయారు చేయడమే తమ లక్ష్యమని సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. తమ సంస్థ యొక్క కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ట్రెయినింగ్ తీసుకున్న ఎందరో విద్యార్థులు ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలలో అడ్మిషన్లు సాధించారని ఆయన వెల్లడించారు.