టాక్ బోనాల జాతర పోస్టర్ని ఆవిష్కరించిన కవిత...!!

Shyam Rao

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో జూన్ 25న వెస్ట్ లండన్లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న లండన్ బోనాల జాతర పోస్టర్ను  పార్లమెంట్ సభ్యురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.ఈ సందర్బంగా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ముఖ్య సభ్యులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు రోహిత్ రావు, విజయ్ కోరబోయిన, నితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: