జూనియర్ సెంటిమెంట్ ను ఎదిరించలేకపోతున్న త్రివిక్రమ్ !

Seetha Sailaja
త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం జూనియర్ సెంటిమెంట్ కు భిన్నంగా ఉన్ననేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ వ్యవహార శైలి పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘అరవింద సమేత’ మూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అవుతున్న నేపధ్యంలో త్రివిక్రమ్ ఈమధ్య ఈ షూటింగ్ స్పాట్ లో ఎక్కడా ఎవరు సెల్ ఫోన్స్ తో కనిపించకూడదు అంటూ గట్టి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇప్పుడు ఈ నిర్ణయం జూనియర్ కు ఏమాత్రం రుచించడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం జూనియర్ గతంలో తాను నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా నుండి తాను నటిస్తున్న సినిమా షూటింగ్ స్పాట్ కు తన అభిమానులను పిలిపించుకిని వారితో ఫోటోలు దిగడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. ఈ అలవాటు జూనియర్ నటించిన ‘జనతగ్యారేజ్’ ‘జై లవ కుశ’ సినిమా షూటింగ్ లలో కూడ కొనసాగింది. 

ఈసినిమాలు అన్నీ సూపర్ సక్సస్ అవ్వడంతో తాను నటించే ప్రతి సినిమా షూటింగ్ లోను ఎంతో కొంతమంది అభిమానులను కలిస్తే తనకు సెంటిమెంట్ గా కలిసివస్తుంది అన్న నమ్మకంలోకి జూనియర్ వెళ్లి పోయాడట. ఇప్పుడు ‘అరవింద సమేత’ విషయంలో త్రివిక్రమ్ తీసుకున్న నిర్ణయంతో జూనియర్ అభిమానులు కూడ షూటింగ్ స్పాట్ కు తమ సెల్ ఫాన్స్ లేకుండా రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఈపరిస్థుతులలో జూనియర్ అభిమానులకు తమ అభిమాన హీరోతో తమ సెల్ ఫోన్స్ ఉపయోగించి ఫోటోలు తీసుకునే అవకాశం పోయింది. 

ఈ విషయమై అసంతృప్తి పడుతున్న తన అభిమానుల పరిస్థితిని గమనించిన జూనియర్ వారితో ఫోటోలు తీయించుకునే కార్యక్రమం యధావిధిగా కొనసాగడానికి ఒక ప్రత్యేకమైన ఫోటోగ్ర్రాఫర్ ను ఏర్పాటు చేయమని జూనియర్ త్రివిక్రమ్ ను కోరినట్లు టాక్. అయితే ఈ షూటింగ్ స్పాట్ కు వస్తున్న అనేకమంది అభిమానులు తమ లేటెస్ట్ సెల్ ఫోన్స్ తో పాటు ఐప్యాడ్స్ తో కూడ వస్తున్న నేపధ్యంలో వీటన్నింటిని చెక్ చేయడానికి వీటి భద్రత గురించి ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేకమైన మనుషులను ఏర్పాటు చేయడం త్రివిక్రమ్ కు ఇష్టం లేకపోయినా జూనియర్ సెంటిమెంట్ ను ఎదిరించే ధైర్యం లేక రాజీపడుతున్నట్లు సమాచారం..  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: