షాకింగ్ మఠం విడిదిలో పవన్ ఆంతర్యం !

Seetha Sailaja
‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ అనేక రకాల షాక్ లు ఇచ్చి తాను సామాన్యుడుని మాత్రమే అన్న సందేశాలు ఇస్తూ తన ఇమేజ్ ని రాజకీయంగా పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగా నిన్న శనివారం అర్ధరాత్రి ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పవన్ తిరుమల కొండపైకి చేరుకోవడమే కాకుండా రాత్రి అలిపిరి నుండి కాలినడకన తిరుమల దర్శనం చేసుకోవడం హాట్ న్యూస్ గా మారింది. 

పవన్ అతి రహస్యంగా జరిపిన ఈ తిరుమల యాత్ర కోలాహలంగా జరిగింది. పవన్ తో పాటు పవన్ అభిమానులు కూడ తిరుమల ఏడుకొండలను ఎక్కారు. అయితే ఎటువంటి హంగామా లేకుండా విలాసవంతమైన సౌకర్యాలకు దూరంగా పవన్ హంపీ మఠంలో విడిది చేయడం సంచలనంగా మారింది. ఈ మఠంలోనే పవన్ మూడురోజుల పాటు ఉండబోతున్నట్లు సమాచారం. 

అయితే పవన్ ఇంత ఆధ్యాత్మిక ధోరణితో ఈమూడు రోజులు ఈ మఠంలో ఏమిచేయబోతున్నాడు అన్న రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. పవన్ సాంప్రదాయమైన పద్ధతిలో కనిపిస్తూ ఏడుకొండలు ఎక్కిన దృశ్యాలను పవన్ అభిమానులతో పాటు నిన్న రాత్రి తిరుమల కొండ ఎక్కుతున్న భక్తులు కూడ తమ సెల్ ఫోన్స్ లో ఫోటోలుగా తీయడంతో తిరుమల కొండ పై భక్తి వాతారణం బదులు అభిమానులతో కోలాహలం కనిపించింది.

ఈమూడురోజుల ఆధ్యాత్మిక ధ్యానం తరువాత పవన్ నేరుగా ఇచ్చాపురం వెళ్లి తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించబోతున్నాడు అని తెలుస్తోంది. పవన్ ‘జనసేన’ పార్టీ విస్తరణకు అత్యంత కీలకంగా మారిన ఈబస్సు యాత్ర విజవంతం కావాలని తిరుమల వేంకటేశ్వరుడుని మూడు రోజులపాటు ధ్యానించబోతున్నాడు పవన్..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: