ప‌వ‌న్‌ను తిట్టడం కోస‌మే మా నాన్న‌ను వాడుకుంటున్నాడు: జ‌గ‌న్‌పై ముద్ర‌గ‌డ కూతురు ఫైర్‌..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల హడావిడి రోజు రోజుకి హీట్ పుట్టించేలా చేస్తోంది.. ముఖ్యంగా ఒకే కుటుంబంలో రెండు పార్టీల కుంపటులుగా మారుతున్నాయి.. ఇప్పటివరకు అలా ఎంతోమంది నేతల పేర్లు విన్నప్పటికీ ఇప్పుడు తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆయన ఇంట్లో కూడా ఈ విధంగానే జరుగుతోంది. గడిచిన కొద్ది రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పద్మనాభం ఫైర్ అవుతూనే ఉన్నారు.. ఇటీవలే ఒక మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ ని కచ్చితంగా ఓడిస్తానని అలా చేయకపోతే తన పేరు మార్చుకుంటానని శపధం కూడా చేశారు.

జగన్ ను కుర్చీ నుంచి తప్పుకోమనడానికి పవన్ కళ్యాణ్ కు ఎలాంటి హక్కు ఉందంటూ ఆయన ప్రశ్నించారు.. అది ప్రజలు ఇచ్చిన కుర్చీ అంటూ పవన్ ఈ విషయాన్ని మర్చిపోవద్దు అంటూ కూడా చురకలంటించారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా బూతులు మాట్లాడుతూ ఉండడంతో ముద్రగడ ఫైర్ అయ్యారు.. ఒకపక్క పెద్దలను గౌరవిస్తానంటూ మరొక పక్క బూతులు మాట్లాడుతూ ఉండడం చేత ముద్రగడ పవన్ పైన ఫైర్ అయినట్టుగా. గతంలో తుని ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్. అయితే అందులో కర్త ,కర్మ ,క్రియ తానే అన్నటువంటి ముద్రగడ చివరికి రైలు తగలబెట్టింది మాత్రం చంద్రబాబు అంటూ పలు రకాల ఆరోపణలు చేశారు.

తాజాగా ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఈ ఛాలెంజ్ పైన ఆయన కూతురు క్రాంతి స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది..పిఠాపురంలో పవని ఓడించడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని జరుగుతున్నాయని ముఖ్యంగా తన తండ్రి పద్మనాభం ఛాలెంజ్ చేయడం కూడా చాలా బాధాకరంగా అనిపించింది అంటూ వెల్లడించింది. వంగ గీతానికి గెలిపించడానికి కష్టపడవచ్చు.. కానీ పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులను కించపరిచేలా మాట్లాడకూడదంటూ తెలిపింది. పవను తిట్టడం కోసమే మా నాన్నను జగన్ వాడుకుంటున్నారంటూ ముద్రగడ కూతురు ఫైర్ అవుతోంది.. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానంటూ కూడా తెలియజేసింది. మరి ఏ మేరకు ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: