షాకింగ్ హాట్ న్యూస్ గా మారిన మహేష్ అతి జాగ్రత్త !

Seetha Sailaja

‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ సినిమాల వరుస పరాజయాలతో అయోమయంలో పడ్డ మహేష్ ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తో మరింత టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టెన్షన్ అతి జాగ్రత్తగా మారి మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘భరత్ అనే నేను’ మూవీ పై ప్రభావం చూపెడుతోంది అని అంటున్నారు.

 

దీనితో ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ సంక్రాంతికి కూడ విడుదల చేయకుండా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ విషయమై మరిన్ని లోతైన ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమా విడుదల తేదీ ఏప్రియల్ 27 తేదీ కాబట్టి ఇంత ముందుగా  మూవీ ప్రమోషన్ ను మొదలుపెట్టి ఈసినిమా పై భారీ అంచనాలు పెంచడం మహేష్ కు ఏమాత్రం ఇష్టం లేదు అని టాక్.

 

ఈమధ్య కాలంలో భారీ అంచనాలతో వచ్చిన టాప్ హీరోల సినిమాలు అన్నీ ఫెయిల్ అయిన నేపధ్యంలో మహేష్ తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ కు సంబంధించి పెద్దగా ప్రమోట్ చేయకుండా లో ప్రొఫైల్ మెయిన్ టైన్ చేయాలని మహేష్ అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయాలు రాజకీయ వ్యవస్థ నేపధ్యంలో రూపొందుతున్న ఈమూవీ స్క్రిప్ట్ విషయం పై కూడ కొన్ని గందరగోళాలు తలెత్తిన నేపధ్యంలో మహేష్ గతంలో తనకు కలిగిన అనుభవాలతోపాటు లేటెస్ట్ గా పవన్ కు కలిగిన పరాభవాన్ని కూడ పరిగణలోకి తీసుకుని తన లేటెస్ట్ మూవీ యాక్షన్ ప్లాన్ మార్చాడు అని అంటున్నాడు.

 

టాప్ హీరోల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడటంతో ఒక్క పరాజయం వస్తేనే హీరోల ఇమేజ్ విపరీతంగా పడిపోతోంది. ఇప్పటికే రెండు పరాజయాలతో సతమతమౌతున్న మహేష్ మరో పరాజయాన్ని తట్టుకునే పరిస్థితిలో లేదు. అందువల్లనే తన లేటెస్ట్ మూవీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నేపధ్యంలో తన మూవీ ఫస్ట్ లుక్ విడుదలను ఈ సంక్రాంతికి కాకుండా మరో తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఏమైనా ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం టాప్ హీరోలందరికీ చాల పాఠాలు నేర్పుతున్నట్లే కనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: