సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లు..దర్శక, నిర్మాతలు వీలు చిక్కినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తారు. అక్కడ కొన్ని రోజుల పాటు హాయిగా సేద తీరుతూ తమ కుటుంబంతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, మంచు ఫ్యామిలీ ఇలా చాలా మంది సినిమా షూటింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత విదేల్లో ఆనందంగా గడిపి వస్తుంటారు.
రీసెంట్ గా రాంచరణ్, ఉపాసన తాము ఎంజాయ్ చేస్తున్న ఫోటో పిక్ పంపించి అభిమానులను ఖుషీ చేసింది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో హిమగిరుల్లో సరదాగా గడుపుతున్నారట. ఇప్పటికే మంచు దున్నపై రామ్ చరణ్ రైడింగ్ చేస్తోన్న ఫోటోలను సోమవారం ఉపాసన షేర్ చేయగా.. బన్నీ, చెర్రీలు రోహ్తక్లో దిగిన ఫొటోల్ని అల్లు శిరీష్ మంగళవారం ట్వీట్ చేశాడు.
భార్యతో బన్నీ కలిసి ఉన్న ఫొటోను, చెర్రీ శిఖరం అంచున నిల్చున్న ఫొటోలను శిరీష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బన్నీ మనాలీలో హాలీడేస్ను ఎంజాయ్ చేస్తున్నవీరు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు.
Bunny & Sneha. #rohtangpass #manalidiaries pic.twitter.com/tMJ06VstFf— Allu Sirish (@AlluSirish) October 31, 2017
Ram Charan at Rohtang pass. Shot by me. pic.twitter.com/8AQ5H61lBh— Allu Sirish (@AlluSirish) October 31, 2017
Manali sunset. #photography #OnePlus5 #snapseed pic.twitter.com/8Cygw5590K— Allu Sirish (@AlluSirish) October 30, 2017