టాలీవుడ్ తన అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించిన నటి అనుష్క ‘బాహుబలి’ మొదటి పార్ట్ లో డీ గ్లామర్ పాత్రలో కనిపించింది. బాహుబలి 2 లో దేవసేన పాత్రలో మహారాణిగా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ మూవీ తర్వాత లేడీ ఓరియెంటెండ్ పాత్ర ‘భాగమతి’ మూవీలో నటించింది. ఆ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘నిశ్శబ్దం’ సినిమా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.
ఈ పోస్టర్ చూస్తుంటే అనుష్క మరోమారు తెలుగు ప్రేక్షకులను తన వైవిధ్యమైన నటతో మెప్పించేలా కనిపించింది. తాజాగా ఈ మూవీలో నటిస్తున్న మరో పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తమిళ స్టార్ నటుడు మాధవన్ ఈ మూవీలో అంథోనిగా నటిస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్పై.. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ‘నిశ్శబ్దం’ నుండి మాధవన్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్గా కనిపించనున్నాడు. వయోలిన్ ప్లే చేస్తున్న మాధవన్ లుక్ చాలా బాగుంది. తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ‘కిల్ బిల్’ మూవీలో విలన్గా నటించిన మైఖేల్ మ్యూడిసన్తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు నటించారు. నలుగురు ఇండియన్స్కి అమెరికా పోలీసులకు మధ్య జరిగే క్రైమ్ థ్రిల్లర్గా రూపొందించారు.