రికార్డు వ‌సూళ్లే టార్గెట్‌... రికార్డ్ స్థాయిలో ' పుష్ప 2 ' రిలీజ్... ఎన్ని వేల స్క్రీన్లో తెలుసా..!

RAMAKRISHNA S.S.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప పార్ట్ 2 సినిమా మీద పడేలా చేస్తున్నారు మేకర్స్. భారతదేశం మొత్తం పుష్ప 2 మానియాలో మునిగితేలుతుంది. ఇక మొదటి రోజు వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించాలంటే ఏం చేయాలి.. మొదటిరోజు తిరుగే లేని వసూళ్లు రాబట్టాలంటే ఏం చేయాలి.. అనే దానిమీద పుష్ప 2 నిర్మాతల ప్లానింగ్ మామూలుగా లేదు. తొలిరోజు మాగ్జిమం స్క్రీన్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బెనిఫిట్ షో, మిడ్ నైట్ షోలు కుమ్మేయాలి.

ప్రస్తుతం పుష్ప 2 రిలీజ్ సంబంధించి ఇదే ప్లానింగ్ నడుస్తోంది. కానీ వినీ ఎరుగ‌ని రీతిలో పుష్ప పార్ట్ 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో దేశవ్యాప్తంగానే 6500 స్క్రీన్లు ఉంటే.. దేశం వెలుపల 5000 స్క్రీన్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ ఈ స్క్రీన్ కౌంట్ మరింత పెరుగుతుందని తెలుస్తోంది. మొదటిరోజు షోల విషయంలో కూడా ప్లానింగ్ రెడీ అయింది. ఏపీ, నైజాంలో అర్ధరాత్రి ఒంటిగంట నుంచే పుష్ప 2 షోలు పడబోతున్నాయి.

హైదరాబాదులో బెనిఫిట్ షోలు వేసేందుకు లైన్ క్లియర్ చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మిడ్ నైట్ షోకు అనుమతులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు.. అర్ధరాత్రి వరకు ప్రత్యేక అనుమతులు తీసుకోనున్నారు. ఏది ఏమైనా ఓవరాల్గా మొదటి రోజు షో కౌంటు భారీగా ఉండబోతుంది. అటు నార్త్ ఇండియాలో కూడా మొదటి రోజు స్క్రీన్ కౌంట్‌ పై చర్చలు సాగుతున్నాయి.

మొదటి రోజు క‌లెక్ష‌న్లు కూడా ఊహ‌కు అందని విధంగా ఉండాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు. వాస్తవంగా డిసెంబర్ 6న రిలీజ్ కావలసిన పుష్ప 2 సినిమాను ఒక రోజు ముందుకు జరిపారు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. అల్లు అర్జున్, రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: