కష్టాల్లో సమంత..దగ్గర అయ్యేందుకు దర్శకుడు కుట్రలు..?

Veldandi Saikiran
సమంత ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్గా రాణించింది. ఏ మాయ చేసావే సినిమా సమయంలో తనతో పాటు నటించిన అక్కినేని నాగచైతన్యతో ఈ చిన్నది ప్రేమలో పడింది. వారి ప్రేమను కొన్నేళ్లపాటు సీక్రెట్ గా కొనసాగించిన ఈ జంట కుటుంబసభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహాన్ని చేసుకున్నారు.

పెళ్లి తర్వాత వైవాహిక జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగిందని చెప్పవచ్చును. కొన్నేళ్లకు ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లుగా వారి సోషల్ మీడియా అకౌంట్లలో ఓ పోస్ట్ ను షేర్ చేసుకున్నారు. ఈ పోస్ట్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరి విడాకులకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఇదిలా ఉండగా.... తాజాగా రాజ్ నిడిమోరు ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంత గురించి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.

అయితే విడాకుల అనంతరం సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంది. అయితే షూటింగ్ సమయంలో సమంత సడన్ గా స్పృహ కోల్పోయి కింద పడిందట. సమంత అలా ఎందుకు కింద పడిపోయిందో తెలియక వారు చాలా భయపడ్డారట. షూటింగ్ సమయంలో సమంత అలా పడిపోవడంతో వారందరూ చాలా భయపడ్డామని రాజ్ తెలియజేశారు.

అంతేకాకుండా షూటింగ్ సమయంలో సమంత చాలా కష్టాలు పడిందని చెప్పాడు. తన ఆరోగ్యానికి సంబంధించి చికిత్స తీసుకుంటూనే ధైర్యంగా షూటింగ్ కు సమంత పాల్గొన్నారని రాజ్ తెలియజేశాడు. షూటింగ్ కోసం అంతా రెడీ చేసుకుని సమంత కోసమే ప్రతిరోజూ ఎదురు చూసేవారమని రాజ్ చెప్పాడు. ప్రస్తుతం రాజ్ నిడిమోరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఒంటరిగా ఉన్న సమంతకు దగ్గరయ్యేలా రాజ్ నిడిమోరు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: