ఇండియన్స్ ని అవమానించిన సాయి పల్లవి.. "అమరన్" మూవీ పై వేటు తప్పదా.?

Pandrala Sravanthi
ఏంటి ఎంతో ఆలోచించి మాట్లాడే సాయి పల్లవి ఇండియన్స్ ని కించపరిచేలా మాట్లాడిందా.. ఇంతకీ సాయి పల్లవి ఏం మాట్లాడింది.. ఆమె మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. కొంతమంది హీరో హీరోయిన్లకు సంబంధించిన సినిమాలు విడుదలయితే ఖచ్చితంగా వాళ్లకు సంబంధించిన పాత విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. కొంతమంది అయితే పాత వీడియోలను వెతికి మరీ వైరల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా అమరన్ మూవీ అక్టోబర్ 31 విడుదలవుతున్న నేపథ్యంలో సాయి పల్లవికి సంబంధించిన పాత వీడియో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో ఏముందంటే.. సాయి పల్లవి నటించిన విరాటపర్వం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ గురించి మాట్లాడుతూ మన ఇండియన్ ఆర్మీ కి పాకిస్తాన్ ఆర్మీ ఎలా అయితే ఉగ్రవాదుల్లా కనిపిస్తారో పాకిస్తాన్ ఆర్మీ కి కూడా మన ఇండియన్ ఆర్మీ అలాగే కనిపిస్తారు. 

ఇలా ఎవరి దృక్పదాలు వారికి ఉంటాయి అంటూ సాయి పల్లవి మాట్లాడింది. అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో సాయి పల్లవి పై ఇండియన్స్ ఫైర్ అవుతున్నారు.మీరు మాట్లాడిన దాంట్లో చాలా తప్పు ఉంది. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఇద్దరు ఒక్కటేనా.. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఇండియా పై ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఎప్పుడు ఏంచేస్తారో అని తెలియడం లేదు. కానీ ఇండియన్ ఆర్మీ మాత్రం వారి కి ఎలాంటి హాని కలిగించడం లేదు.వారు మనకు హాని చేస్తే వాటిని తిప్పి కొట్టడం తప్ప స్వయంగా వీల్లైతే ఎలాంటి కుట్రలు చేయడం లేదు అంటూ సాయి పల్లవి పై ఫైర్ అవుతున్నారు.

కానీ మరి కొంత మందేమో సాయి పల్లవికి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే మన ఇండియన్స్  పాకిస్తానీలను ఎలా అయితే అనుకుంటారో పాకిస్తాన్ లో కూడా ఇండియన్స్ ని అలాగే అనుకుంటారు కదా.. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ సపోర్ట్ ఇస్తున్నారు.. అయితే ఈ పాత వీడియో వైరల్ అవ్వడంతో విడుదలకు సిద్ధంగా ఉన్న అమరన్ మూవీ పై వేటు పడే అవకాశం కనిపిస్తోందని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఈ నెగెటివిటీ ఎక్కడికి దారి తీస్తుందో అని భయపడుతున్నారు కూడా. మరి చూడాలి సాయి పల్లవి పాత వీడియో ప్రభావం అమరన్ మూవీపై ఏమైనా పడుతుందా అనేది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: