బిగ్ బాస్ కంటెస్టెంట్ కి తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అసలు ఏం జరిగిందంటే..!?

Anilkumar
బుల్లితెరపై బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ షోకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు విమర్శలు ఎన్ని వచ్చినా ఈషోకు మాత్రం ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. సినీ పరిశ్రమలో అవకాశాలు.. పాపులారిటీ పెంచుకోవాలని అనుకునేవాళ్లు చాలా మంది ఈ షోలోకి అడుగుపెడుతుంటారు. కానీ ఇక్కడికి వచ్చాకా మాత్రం సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. బిగ్‏బాస్ షోకు ముందు హీరోగా ఉన్నవారు జీరోగా.. అసలు జనాలకు పరిచయమే లేని వాళ్లు హీరోలుగా మారుతుంటారు. కానీ చాలా మంది బిగ్‏బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 తెలుగులో బిగ్‏బాస్ సీజన్ 7లో పాల్గొన్న ఈ నటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒకటి రెండు చిత్రాల్లో హీరోయిన్ గా చేసినా రాని గుర్తింపు బిగ్‏బాస్ రియాల్టీ షో ద్వారా వచ్చింది.  అయితే  తాజాగా ఈ భామ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వెళుతుండగా.. ఆమె కార్‌ను ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఆదివారం (అక్టోబర్ 06) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నాగార్జున సాగర్ లోని బస్టాండ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు తాగి నడుపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయలు అవ్వగా.. బిగ్ బాస్ బ్యూటీ

 తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది.  కాగా బిగ్‏బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఇన్ స్టాలో ఫోటోషూట్స్, రీల్స్ అంటూ సందడి చేస్తుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత భోలే షావలి, శుభశ్రీ కలిసి ఒక ఆల్బమ్ సాంగ్ చేశారు. ముందుగా ఆ సాంగ్‌ను ఈ పార్టీలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా చూశారు. అది చూసి కంటెస్టెంట్స్ అంతా బాగుందంటూ వారిని ప్రశంసించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: