12 ఎకరాలు కబ్జా చేసిన టాలీవుడ్‌ యంగ్‌ హీరో?

Veldandi Saikiran
మెగా కుటుంబం నుంచి సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇటీవలే ఈ హీరో విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. వివిధ రకాల సినిమాలు చేస్తూ సాయిధరమ్ తేజ్ తానేంటో ప్రేక్షకులకు నిరూపించుకున్నాడు. ఇప్పుడు తేజ్ తన పూర్తి మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లేటెస్ట్ గా సాయిధరమ్ నటించిన చిత్రం గాంజా శంకర్. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను సంపత్ నంది చేయనున్నారు.
అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా మధ్యలోనే ఆపేశారు. కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత కేపీ రోహిత్ దర్శకత్వంలో మరో సినిమాను అనౌన్స్ చేశారు. దీన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మించడానికి సిద్ధమైంది. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తొలి షెడ్యూల్ కూడా ఇప్పటికే పూర్తిచేసుకున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కోసం ఏకంగా 12 ఎకరాల్లో ప్రత్యేకంగా సినిమా సెట్ ను నిర్మించారు. కీలకమైన యాక్షన్ ఘట్టాలను ఈ సెట్ లోనే చిత్రీకరించనున్నారు. 12 ఎకరాల్లో సెట్ వేయడం అంటే మామూలు విషయం కాదు. కోట్ల రూపాయల ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటివరకు సాయిధరమ్ తేజ్ కెరీర్ లో ఇంతవరకు భారీ సెట్ నిర్మించలేదు. ఇది తన కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. సినిమా కథ డిమాండ్ చేస్తుంది కనకే అంతమేరకు సెట్ నిర్మిస్తున్నారా.... లేదంటే మరేదైనా కారణం ఉందా... అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనప్పటికీ మెగా ఇంటి నుంచి వచ్చిన హీరో 12 ఎకరాలను కబ్జా చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అనంతరం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న భారీ సినిమా ఇదే కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కు ఎంత మేరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: