ఆ హీరో వల్ల పూనమ్ కౌర్ ప్రెగ్నెంట్.. అబార్షన్ కి కోట్లు..ఆ నటుడు చెప్పిన దాంట్లో నిజమెంత.?

Pandrala Sravanthi
 టాలీవుడ్ లో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఇష్యూ చర్చనీయాంశంగా మారడంతో ఇదే అదను అనుకుందో ఏమో గాని నటి పూనమ్ కౌర్ కూడా రెచ్చిపోతుంది. ఆమె కూడా త్రివిక్రమ్ గురించి ట్వీట్ చేస్తూ నేను అప్పుడే త్రివిక్రమ్ గురించి కంప్లైంట్ చేశాను. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఒకవేళ వాళ్ళు నాకు సహకరించి ఉంటే ఇంత మంది అమ్మాయిల జీవితాలు బలయ్యేవి కావు అంటూ సంచలన ట్వీట్ పెట్టింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ ల ఇష్యూ భగ్గుమంది.మరి ఇంతకీ పూనమ్,త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి.. ఆ హీరో వల్ల పూనమ్ నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా.. ఆ నటుడు చెప్పిన దాంట్లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. పవన్ కి పూనమ్ కి మధ్య అప్పట్లో ఎఫైర్ ఉండేది అని టాలీవుడ్ మీడియా లో గట్టిగా వినిపించింది. అయితే అందరూ జల్సా సినిమా సమయంలో వీరి మధ్య విభేదాలు వచ్చాయి అని అంటుంటారు. ఇక మరికొంత మందేమో తీన్ మార్ సినిమా సమయంలో సెకండ్ హీరోయిన్ గా చేసిన కృతికర్పందా కంటే ముందు పూనమ్ ని తీసుకొని ఆ తర్వాత ఆమెను తీసేసి కృతిని పెట్టారు అనే టాక్ వినిపించింది  

ఇక అంతకుముందే పవన్ కళ్యాణ్ పూనమ్ ల మధ్య ఎఫైర్ కొనసాగడంతో ఆయన కారణంగా పూనమ్ కౌర్ ప్రెగ్నెంట్ అయిందనే వార్త మీడియాలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ విషయాన్ని టాలీవుడ్ సినీ యాక్టర్ అయినటువంటి పోసాని కృష్ణ మురళి బయట పెట్టడంతో ఒక్కసారిగా మీడియాలో దుమారం సృష్టించింది. పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ.. ఆడవాళ్లు దేవతలు అంటూ మాట్లాడే పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ విషయంలో ఎందుకు అన్యాయం చేశారు.. ఆయన పూనమ్ కౌర్ ని ప్రేమ పేరుతో నమ్మించి ప్రెగ్నెంట్ ని చేసి చివరికి అబార్షన్ చేయించాడు.. వీరిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ తెలిసే రేణు దేశాయ్ పవన్ కి దూరమైంది అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు.

అయితే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ల గురించి సంచలన విషయం బయట పెట్టడంతో పోసాని కృష్ణ మురళి మాటాలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఈ విషయంలో పూనమ్ కి త్రివిక్రమ్ డబ్బులు ఇచ్చి ఈ విషయం బయటికి రాకుండా చేశారని, పవన్ పూనమ్ కి మధ్య త్రివిక్రమ్ ఉన్నారని,ఇక పవన్ గురించి త్రివిక్రమ్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ మొత్తం పూనమ్ కౌర్ దగ్గర ఉన్నాయని,అందుకే ఈ రికార్డింగ్స్ పట్టుకొని పూనమ్ కౌర్ వీరిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఏది ఏమైనప్పటికీ పూనమ్ కౌర్ ఎన్నిసార్లు కాంట్రవర్సీ ట్వీట్లు పెట్టినా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ స్పందించకపోవడంతో నిజంగానే పూనమ్ కి అన్యాయం జరిగిందని, ఈ విషయంలో పోసాని కృష్ణ మురళి చెప్పిందే నిజం కావచ్చు అని కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: