రజిని మూవీలో చిన్న పాత్ర చేయాలనుకున్న బాలయ్య.. ఆ ఒక్క కారణంతో చివరి నిమిషంలో క్యాన్సల్..?

MADDIBOINA AJAY KUMAR
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. బాలకృష్ణ తమిళ దర్శకుడు అయినటువంటి కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో రూపొందిన జై సింహా , రూలర్ అనే రెండు సినిమాలలో హీరోగా నటించాడు. ఇందులో జై సింహ మూవీ మంచి విజయాన్ని అందుకోగా, రూలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ రెండు సినిమాల కంటే ముందే కే ఎస్ రవి కుమార్ బాలకృష్ణ తో ఓ సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ అది కుదరలేదు. అసలు ఎందుకు కుదరలేదు ... ఏమయింది అనే వివరాలను తెలుసుకుందాం.
కే ఎస్ రవి కుమార్ కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కథానాయకుడు అనే అనే సినిమాను తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రజనీ కాంత్ కు స్నేహితుడు పాత్రలో తెలుగు వర్షన్ లో జగపతి బాబు నటించాడు. మొదట ఈ సినిమా తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కు స్నేహితుడి పాత్రలో జగపతి బాబు ను కాకుండా బాలయ్య ను తీసుకోవాలి అని రవి కుమార్ అనుకున్నాడట. అందులో భాగంగా బాలయ్య ను కలిసి కథ వివరించగా ఆయన కూడా చేస్తాను అన్నాడట. ఆ తర్వాత రజనీ కాంత్ , బాలకృష్ణ కు ఫోన్ చేసి కథానాయకుడు సినిమాలో నా స్నేహితుడి పాత్ర చేయడానికి ఒప్పుకున్నావట కదా.. కానీ ఆ పాత్ర చెయ్యకు. ఎందుకు అంటే నీ ఈమేజ్ చాలా పెద్దది. నీ ఈ ఈమేజ్ మ్యాచ్ చేయాలి అంటే సినిమా కథలో మార్పులు చేయవలసి ఉంటుంది. అలా చేసినట్లు అయితే కథలోని సహజత్వం పోతుంది. దానితో సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉంది అందు వలన ఆ సినిమా చేయకు అన్నాడట. దానితో బాలయ్య కూడా రజనీ కాంత్ చెప్పిన విషయానికి కన్విన్స్ అయ్యి ఆ సినిమా చేయలేను అని రవి కుమార్ కు చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: