జానీ మాస్టార్‌ కు ఎదురుదెబ్బ... లవ్ జిహాద్ కేసు నమోదు..?

Veldandi Saikiran
కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా చుట్టు ఉచ్చుబిగుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ యువతిని రేప్‌ చేసిన కేసులో కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు నోటీసులు ఇచ్చారు హైదరాబాద్‌ పోలీసులు. అయితే.. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక దాడి కేసుపై భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి స్పందించారు. కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని ఆగ్రహించారు. ఓ యువతిని ఐదేళ్ల పాటు నరకం చూపించడంతో పాటు, వేధింపులు, దాడులకు పాల్పడటం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు డాక్టర్ శిల్పారెడ్డి.

ఇది లవ్ జిహాద్ కేసు అన్నారు. హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి..? అంటూ ప్రశ్నించారు డాక్టర్ శిల్పారెడ్డి.  ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని ఆగ్రహించారు డాక్టర్ శిల్పారెడ్డి. ఈ ఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మహిళలపై అత్యాచారాలు, హిందూ మహిళలను మతం మార్చి లైంగికంగా వేధించే ఘటనలు తీవ్రమైనా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా వ్యవహరించకపోవడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు డాక్టర్ శిల్పారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. దీనికి హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా హోంశాఖపై ఒక్కసారి కూడా సమీక్షించలేకపోవడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింత దిగజారిందన్నారు.  షేక్ జానీపై గతంలోనూ నేరచరిత్ర ఉందని, 2015లో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో 2019లో మేడ్చల్ కోర్టు ఆరునెలల పాటు జైలుశిక్ష విధించినట్లు స్వయంగా పోలీసులే వెల్లడించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి, చట్టపరంగా పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు డాక్టర్ శిల్పారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: