పూరి జగన్నాథ్.. చార్మి : వీరిద్దరి గురించి అన్ని కథనాలు.. అంతటికీ ప్రారంభం అక్కడే..?

Pulgam Srinivas
సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు పలానా వారితో ఎఫైర్లు పెట్టుకున్నారు అని వార్తలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని సాక్షాలతో రుజువు కాగా మరికొన్ని రూమర్ లుగానే మిగిలిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమకు వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఎన్నో వార్తలు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొంతకాలం క్రితం దగ్గుపాటి అభిరామ్ నన్ను ప్రేమించాడు. నాతో గడిపాడు అంటూ శ్రీ రెడ్డి చెప్పింది. అందుకు తగిన ఫోటోలను కూడా విడుదల చేసింది. ఈ వార్త కొంత కాలం పాటు తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపింది.

ఇక కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ నాతో ప్రేమాయణం నడిపాడు అని , నన్ను వాడుకున్నాడు అని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం లేదు అని లావణ్య అనే ఒక యువతి చెప్పుకొచ్చింది. ఈ వార్త కూడా తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన డాన్స్ మాస్టర్ అయినటువంటి జానీ మాస్టర్ తనను వేధించాడు అని , తోటి డాన్సర్ పోలీస్ స్టేషన్ లో తాజాగా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపుతుంది.    

ఇలాంటి మరెన్నో ఘటనలు కూడా ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లను ఒకరిగా కెరియర్ను కొనసాగించిన పూరి జగన్నాథ్ తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటిగా చాలా సంవత్సరాలు కెరియర్ను సాగించిన చార్మి మధ్య ఎఫైర్ ఉంది అంటూ కూడా వార్తలు అనేకం బయటకు వచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన జ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా నుండి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది అని , అది మరింత ముందుకు వెళ్ళింది అని అనేక కథనాలు బయటికి వచ్చాయి.

ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. దానితో వీరిద్దరి మధ్య బంధం బలంగా ఉంది అని వార్తలు షికారు చేస్తున్నాయి. మరి వీరిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందో తెలియదు కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన జ్యోతిలక్ష్మి సినిమాలో ఛార్మి ప్రధాన పాత్రలో నటించడం , ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి సినిమాలు నిర్మిస్తూ ఉండడంతో వీరి మధ్య ఏదో ఉంది అనే వార్తలు మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: