అభిమాని హత్య కేసులో.. నిజాలు ఒప్పుకున్న హీరో దర్శన్.. ఏం చెప్పాడంటే..?

Divya
కన్నడ హీరో దర్శన్ అభిమానిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. నటి పవిత్ర గౌడ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు కొట్టి చంపినట్టుగా వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన ప్రత్యేకమైన బృందం కేసును దర్యాప్తు చేసి పోలీసులు  దర్శన్ కి అగైనెస్ట్ గా ఆధారాలను సబ్మిట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అభిమాని రేణుకాస్వామి పైన దాడి చేసినట్లుగా దర్శన్ అంగీకరించినట్లు వాంగ్మూలంలో తెలియజేశారట. పోలీసులకు అందిన వాంగ్మూలంలో దర్శన్ ప్రతి విషయాన్ని కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.

రేణుకాస్వామి చాతి మీద అలాగే తలపై, మెడపై, తన్నానని తన చెప్పుతో కొట్టమని పవిత్ర గౌడ్ కు కూడ చెప్పానని పోలీసులకు తెలియజేసినట్టు సమాచారం.. అలాగే దర్శన్ చూసేసరికి రేణుక స్వామి అలసిపోయారని అప్పటికే తాను దాడికి గురైనట్లుగా గుర్తించాలని వాంగ్మూలంలో తెలియజేశారట. అలాగే అతని చేతుల పైన చెక్క కొమ్మతో కొట్టానని ఇలా అన్ని నిజాలను కూడా అంగీకరించినట్లుగా జాతీయ మీడియాలు కథలుగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో మొదటి నిందితురాలుగా పవిత్ర గౌడ ఉన్నదట.. రేణుక స్వామి హత్యకు ప్రధాన కారణమట.

మరి కొంతమందితో కలిసి రేణుక స్వామిని హత్య చేసినట్లు విచారణలో రుజువు అయ్యిందని ఇప్పటికే పోలీసులు కూడా తెలియజేశారు. అంతేకాకుండా రేణుకా స్వామి దెబ్బలు తిన్న కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. హత్యకు గురవ్వడానికి ముందు తనని వదిలేయమంటూ అందరిని ప్రాధేయపడ్డట్టుగా ఒక వీడియో కూడా కలకలని సృష్టించింది. ముఖ్యంగా పవిత్ర గౌడ్ కు ఆసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం వల్లే ఇది జరిగినట్లుగా పోలీసులు పదేపదే తెలియజేస్తున్నారు. రేణుకా స్వామిని R R నగర్లో ఒక షెడ్డులోకి తీసుకువచ్చి మరి చిత్రహింసలు పెట్టిన తరువాత దర్శన్ తనని చూడాలని చెప్పడంతో అతడిని తీసుకువచ్చారట. ఆ తర్వాతే చిత్రహింసలు చేసి రేణుకా స్వామిని హత్య చేశారని ఆరోపణలు కూడా వచ్చాయి. పోస్టుమార్టంలో కూడా రేణుకా స్వామి శరీరం పైన కొన్ని గాయాలు ఉన్నాయని రక్తస్రావం అయి మరణించారనే విధంగా కూడా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: