అనసూయ: ఛీ..ఛీ..సీసీ కెమెరాల్లో యాంకర్‌ రహస్యాలు.. ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 20 ఏళ్ల కిందట ఎన్టీఆర్ నటించినటువంటి నాగ సినిమాలో ఈ బ్యూటీ ఓ పాత్రలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల నుంచి తప్పుకుంది. న్యూస్ ప్రజెంట్ గా చేస్తూనే మళ్లీ ఇండస్ట్రీవైపుకు వచ్చింది.

జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఓవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసి వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ప్రస్తుతం అనసూయ పుష్పటు సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా అనసూయ మళ్లీ బుల్లితెరకు కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే అనసూయకు సంబంధించిన ఓ వార్తని ఆమె కాలేజీ ఎన్సిసి ట్రైనింగ్ ఆఫీసర్ సరోజ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. అనసూయ కాలేజీ చదువుకునే రోజుల్లో తనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదట. అంతేకాకుండా అనసూయ కోసం అబ్బాయిలు వెంటపడుతూ ఉండేవారట. కానీ అనసూయ వారినుంచి తప్పించుకోవడానికి విపరీతంగా ప్రయత్నాలు చేసేదట.

ఇక ఆ సన్నివేశాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యేవట. వాటిని సుశాంక్ చూడటం.... అప్పుడు అనసూయ అందానికి ఫిదా అయ్యాడట. ఆ సమయం నుంచి సుశాంక్ అనసూయని ప్రేమలో పడేసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో అనసూయ అందంపై అందరూ చర్చించుకుంటున్నారు. కాగా, అనసూయ, సుశాంక్ భరద్వాజ్ ఇద్దరూ పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలను కూడా కనేశారు. ఆ ఇద్దరూ కూడా మగ సంతానమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: