హాఫ్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకున్న మనమే..!

Pulgam Srinivas
శర్వానంద్ ఆఖరుగా ఒకే ఒక జీవితం మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ , ప్రియదర్శి కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ తో మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న శర్వానంద్ తాజాగా మనమే అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా , కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించగా ... వషిం అబ్దుల్ వహెబ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. జూన్ 7 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 3 రోజుల్లో నైజాం ఏరియాలో 1.92 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 45 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.01 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 3 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.38 కోట్ల షేర్ ... 8.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 3 రోజుల్లో 35 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 64 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 3  రోజుల్లో 5.37 కోట్ల షేర్ ... 10.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 4.63 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: