"ఎస్ఎస్ఎంబి 29" లో మహేష్ కి జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ మహేష్ బాబు కొంత కాలం క్రితమే గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే మహేష్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొండబోయే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలను ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మొదలు పెట్టే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే చాలా రోజుల నుండి ఈ మూవీ లో మహేష్ కి జోడిగా ఓ హాలీవుడ్ బ్యూటీ నటించబోతుంది అని వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ వార్తలు వాస్తవం అని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా హాలీవుడ్ బ్యూటీ కనిపించబోతున్నట్లే సమాచారం. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ తో పాటు బాలీవుడ్ బ్యూటీ కూడా మహేష్ కు జోడిగా నటించబోతున్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి ఆలియా భట్ ఈ మూవీ లో మహేష్ కు జోడిగా కనిపించబోతున్నట్లు ఈమె పాత్ర సూపర్ గా ఉండబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో అలియా భట్ నటించింది. ఈ మూవీ లో ఆలియా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరోసారి ఈ బ్యూటీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కనిపించబోతున్నట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: