ఏడాది తిరగకుండానే గుడ్ న్యూస్ చెప్పిన లావణ్య..!?

Anilkumar
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భలే భలే మగాడివోయ్ సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత 2017లో మెగా హీరో వరుణ్ తేజ సరసన మిస్టర్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాతో వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలో మళ్లీ కలిసి జంటగా నటించారు. అలా ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం

 కాస్త ప్రేమగా మారింది. అలా కొన్ని ఏళ్లపాటు సీక్రెట్ గా విల్ల ప్రేమ వ్యవహారం నడిపిన తర్వాత గత ఏడాది కుటుంబ సభ్యులను అందరినీ ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఇటలీ లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తరువాత కూడా లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన కెరియర్ పరంగా సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇటీవల మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇక ఈ సీరీస్ తో మంచి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత మరో సినిమా

 ప్రకటించలేదు లావణ్య. ఇందులో భాగంగానే ఇప్పుడు తన మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తనకి సంబంధించిన ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తల్లి కాబోతుందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారట. వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు టాలీవుడ్ వర్గాల టాక్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది.  ఓ బాబుని ఎత్తుకుని ఉన్న ఫోటో ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె తల్లి కాబోతున్న విషయం ఇలా ఇన్ డైరెక్ట్ గా చెప్పిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: