ప్రభాస్ ఫౌజీ మూవీకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

murali krishna
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898AD”.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని బిగ్గెస్ట్ విజువల్ అండర్ గా తెరకెక్కించాడు.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత  అశ్వినీ దత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన, దీపికా పదుకోన్,దిశాపటాని హీరోయిన్స్ గా నటించారు. అలాగే అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ లభించింది. దీనితో ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 195 కొట్ల కలెక్షన్స్ రాబట్టింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి దూసుకుపోతుంది..ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో మారుతీ తెరకెక్కిస్తున్న రాజాసాబ్, ప్రశాంత్ నీల్ సలార్ 2 వున్నాయి. 

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌ అనే చిత్రం కూడా చేయబోతున్నాడు. అయితే ప్రస్తుతం ప్రభాస్ తదుపరి చిత్రం గురించి మరో ఆసక్తికరమైన న్యూస్‌ బాగా వైరల్‌ అవుతుంది.ప్రభాస్ తరువాతి చిత్రం`సీతా రామం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి రూపొందించిన `సీతారామం`చిత్రం ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే ఈయన దర్శకత్వంలో ఇప్పుడు రాబోతున్న చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించునున్నట్లు సమాచారం.

ఈ సినిమా దేశభక్తికి సంబంధించిన సినిమా అని తెలుస్తుంది.. ఇది ఒక ఇండియన్ మిలటరీకి సంబంధించిన కథ అని సమాచారం.ఈ సినిమాలో పాకిస్తాన్ హీరోయిన్ సాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ యార్ని నవీన్, యలమంచలి రవి శంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగష్ట్ 22న ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: