మరోసారి చైతూకి జోడిగా పూజా హెగ్డే..?

MADDIBOINA AJAY KUMAR
నాగ చైతన్య హీరోగా కొన్ని సంవత్సరాల క్రితం ఒక లైలా కోసం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చైతన్య కు జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం , ఇక ఇందులో పూజ హెగ్డే తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి.

దానితో ఈమె ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్నానానికి వెళ్లిపోయింది. అలా నాగ చైతన్య హీరో గా రూపొందిన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి వెళ్లిన ఈ బ్యూటీ మరోసారి చైతన్య హీరోగా రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... నాగ చైతన్య ప్రస్తుతం చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండెల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే చైతన్య "విరూపాక్ష "సినిమాకు దర్శకత్వం వహించి సూపర్ విజయాన్ని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో తేరకేక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీలో చైతూ కి జోడిగా పూజ హెగ్డే ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ఓకే అయితే చైతన్య , కార్తీక్ దండు కాంబో లో తెరకెక్కబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: