దిల్లీ వేదికగా అవార్డు అందుకోబోతున్న క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ...!!

murali krishna
టాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పాత్రల్లో నటిస్తూ తర్వాత స్టార్ కమెడియన్ గా మారిన సత్యం రాజేష్ ఇటీవల నటించిన 'మా ఊరి పొలిమేర2' మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.సత్యం రాజేశ్‌ , కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య లీడ్ రోల్స్‌లో నటించిన ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ మా ఊరి పొలిమేర.ఈ మధ్య కాలంలో హర్రర్ నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆధరణ లభిస్తుంది. మా ఊరి పొలిమేర, మసుధ, విరూపాక్ష, పిండం ఇలా హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న సినిమాలు మంచి హిట్ అవుతున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢ నమ్మకాలపై ప్రజలు విశ్వాసం చూపిస్తుంటారు. చేతబడి, బాణామతి రక రకాల క్షుద్ర పూజలు చేసి మనిషిని హింసించి ఎలా చంపుతారు అన్న కాన్సెప్ట్ తో పలు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.ఓటీటీలో వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ప్రాజెక్ట్‌ మా ఊరి పొలిమేర 2 . డాక్టర్ అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. పల్లెటూరి నేపథ్యంలో చేతబడి చుట్టూ తిరిగే డబుల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ మూవీని బన్నీ వాస్ సౌజన్యంతో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు.చాలా రోజుల తర్వాత ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. మా ఊరి పొలిమేర 2 అరుదైన గౌరవాన్ని అందుకుంది. మా ఊరి పొలిమేర 2 ప్రతిష్టాత్మక 14వ దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ -2024కు ఎంపికైంది. ఏప్రిల్‌ 30న న్యూఢిల్లీలో ఫిలిం ఫెస్టివల్ జరుగనుంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడం పట్ల చిత్రయూనిట్‌ హర్షం వ్యక్తం చేస్తోంది.మా ఊరి పొలిమేర 2 కేవలం 5 రోజుల్లోనే ఆహాలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినట్స్తో అరుదైన ఫీట్‌ నమోదు చేసింది. మా ఊరి పొలిమేర 2 ప్రస్తుతం ఆహాలో అందుబాటులో ఉంది.ఊహించని ట్విస్టులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించడమే కాదు ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. సత్యం రాజేష్ కు ఇదొక డిఫరెంట్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: