ఆ కారణంతోనే హిందీ సినిమాలు చేయడం లేదు... త్రిష..!

Pulgam Srinivas
సౌత్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో త్రిష ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఎన్నో తెలుగు , తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటించి ఇటు టాలీవుడ్ ... అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తెలుగు లో అప్పుడప్పుడు నటిస్తున్నప్పటికీ తమిళ్ లో మాత్రం వరుస పెట్టి క్రేజీ సినిమాలలో నటిస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికీ కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ నటి తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. మరి ఈ మూవీ తో త్రిష తెలుగు లో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇకపోతే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా హిందీ సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా త్రిష మాట్లాడుతూ ... నా కుటుంబాన్ని ముంబై కి చేర్చడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ కి వెళితే దక్షిణాది సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా హిందీ సినిమాలను నేను వదులుకున్నాను. అంతే కానీ నా తొలి హిందీ చిత్రం అయినటువంటి "కట్టా మీఠా" ఫెయిల్యూర్ కావడం వల్లే నాకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో అవకాశాలు రాలేదు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవం అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా త్రిష చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: