ఎప్పుడో పిల్లల్ని కనాలనుకున్నా.. కానీ కుదరలేదు : వరలక్ష్మి శరత్ కుమార్
ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె కేవలం హీరోయిన్ పాత్రలతో మాత్రమే సరిపెట్టుకోకుండా.. ఇక పవర్ఫుల్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంది. ఒక డైరెక్టర్ ఒక సినిమాలో పవర్ఫుల్ పాత్రను రాసుకున్నాడు అంటే చాలు ఆ పాత్రకు మొదటి ఆప్షన్ వరలక్ష్మి శరత్ కుమార్ అన్న విధంగా ఆమె ప్రస్తానాన్ని కొనసాగించింది. ఏకంగా నెగిటివ్ రోల్స్ లో సైతం నటించింది. అయితే ఇప్పుడు 38 ఏళ్ల వయసులో ఓ ఇంటి కోడలుగా మారెందుకు సిద్ధమైంది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే సాధారణంగా తన వ్యక్తిగత విషయాల గురించి బయట చెప్పుకునేందుకు వరలక్ష్మి పెద్దగా ఇష్టపడదు అన్న విషయం తెలిసిందే.
కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ తన పర్సనల్ లైఫ్ గురించి సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నా తొలి చిత్రం పోడా పోడి షూటింగ్ సమయానికి.. నాకు 22 ఏళ్ళు. అయితే 28 ఏళ్లలోపు స్టార్ గా మారిన తర్వాత 32 ఏళ్లకు పెళ్లి చేసుకుని 34 ఏళ్లకు పిల్లల్ని కనాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నా వయస్సు 38 ఏళ్ళు.. నేను వేసుకున్న ప్లాన్స్ ఏవి కూడా వర్కౌట్ కాలేదు అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. కాగా ఇటీవలే సచ్ దేవ్ తో ఆమెకు ఎంగేజ్మెంట్ అయ్యింది అన్న విషయం తెలిసిందే.